Wednesday, March 25, 2009

ఉగాది


తెలుగు వాకిట క్రొంగొత్త ధనంతో ఎటు చుసిన సందడి చేసేది ఉగాది
ఎప్పటికప్పుడు కొత్త పేరుతొ వచ్చినా మానవాళికి నవ్యతను సంతరింపచేసే పెన్నిధి
షడ్రుచుల మేళవింపులో జీవన సారాన్ని తెలియజేసే సంబరాల జావళి
పేరులోనే విరోధి ఉన్నా మనిషికి ఎదురయ్యే ఆటంకాలకు విరోధినవుతానంటోంది
కలకాలం కమ్మని సరిజీవనాన్ని కోరుకోమంటూ
జీవన సమరంలో చూపించాలి తెలుగు దనపు గుభాళింపు..
పిడికెడు స్నేహం..
చారెడు సంతోషం..
గుప్పెడు సహనం..
గరిటెడు నిజాయితీ..
కొంచెం హాస్యం..
చిటికెడు కోపం..
కలగలిపినదే జీవన ఉగాది పచ్చడి ..
ఇదే నేపథ్యంలో నూతన ఉగాది విరోధి ..
కావాలి మీ ఇంట స్నేహ పూర్వక సహవాసి..

Monday, March 23, 2009

శ్రీశ్రీ

స్వాతంత్ర్యం, సమభావం - సౌభ్రాత్రం, సౌహార్దం..
పునాదులై ఇళ్లు లేచి - జనావళికి శుభం పూచి
శాంతి, శాంతి,కాంతి , శాంతి
జగమంతా జయిస్తుంది
ఈ స్వప్నం ఫలిస్తుంది "- శ్రీశ్రీ
"మానవుడు తన మంచి చెడ్డలకు తానేబాధ్యుడు. మానవ సంఘానికి తన పరిస్థితి తానూ చక్కదిద్దుకునే శక్తి ఉన్నాసామజిక చైతన్యం లేదు. అటువంటి చైతన్యం అందించడం కవిత్వం చేయాల్సిన పని " అంటూ జనం బాధలను తన బాధగా ప్రకటించిన మహాకవి శ్రీశ్రీ.తన ప్రతీ రచనలో కష్టాలకు క్రుంగిపోకుండా కదం తొక్కుతూ పదం పాడుతూ ముందుకు సాగామన్నాడు. ప్రాణత్యాగానికి సైతం వెనుకాడకుండా దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాగమని ధైర్యాన్ని నూరిపోసాడు . ప్రభంజనంలోని ఉధృతి, భావంలోని వేగం, నయాగరా జలపాతంలోని చైతన్యంతో ముందుకురకమని మరో ప్రపంచం వైపు మహాప్రస్థానాన్ని సాగించాలని బోధించాడు. పీడితులకు చైతన్యాన్నిచ్చి ముందుకు నడిపించే రచనా వ్యాసంగం శ్రీశ్రీది.
అపారమైన నవ్యుత్పత్తి, అనన్య సామాన్యమైన ప్రజ్ఞ , అనితర సాధ్యమైన సంవిధాన చాతుర్యం, అతులితమైన ఉద్యమ స్పూర్తి, అజేయమైన మానవతా విశ్వాసం .. ఇన్ని లక్షణాలు మూటగట్టుకున్న మన తెలుగు కవి శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ). ఒక శ్రీ కారం అభ్యుదయ ప్రస్తానానికైతే మరో శ్రీ కారం విప్లవ ప్రస్థానానికి ..
1910లో జన్మించిన శ్రీశ్రీ 1933నుంచి 1947వరకు రచించిన 41గీతాలు మహాప్రస్థానం గా అవతరించాయి. 1950జూన్ లో మొదటిసారి ముద్రితమైన ఈ రచన ఇప్పటివరకు 25సార్లు పునర్ముద్రితమైంది.

మన సంస్కృతి

మా తెలుగు తల్లికి మంగళ నీరాజనాలు

!! తెలుగదేలయన్న దేశంబు తెలుగు


ఏను తెలుగువల్లభుండ తెలుగొకండ


ఎల్ల నృపుల గొలువ ఎరుగవే బాసాడి


దేశభాషలందు తెలుగు లెస్స !!